
కోవిడ్పై అలర్ట్!
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
నల్లగొండ టౌన్: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా (కోవిడ్) కొత్త వేరియంట్ ప్రబలి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ అలర్టయ్యింది. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లాలకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో ఎక్కడా కోవిడ్ కేసులు నమోదు కానప్పటికీ నల్లగొండలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)తోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆస్పత్రుల్లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీసింది. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలతోపాటు చికిత్సకు పది బెడ్ల చొప్పున సిద్ధం చేసుకోవాలని మందులు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో అన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తగిన ఏర్పాట్లు చేయడంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
ఆక్సిజన్ నిల్వలున్నా..!
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 700 పడకలు ఉండగా అన్ని బెడ్లకు ఆక్సిజన్ కనెక్షన్ ఉంది. 20 వేల లీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకులు అందుబాటులో ఉండడంతో పాటు ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో గతంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 20 పడకల వార్డు అందుబాటులో ఉంది. మిర్యాలగూ ఏరియా ఆస్పత్రిలో 200 పడకలు ఉండగా ఆక్సిజన్ సౌకర్యం ఉంది. దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్ ఏరియా ఆసుపత్రుల్లో వంద పడకలు ఉండగా ఆక్సిజన్ ఆందుబాటులో ఉంది. మర్రిగూడ ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అవసరమైన మందులు సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు. నల్లగొండతో పాటు అన్ని ఏరియా ఆస్పత్రులు, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్ష కిట్లు అందుబాటులో లేనట్టు తెలిసింది.
2020 మార్చిలో తొలి కేసు
కరోనా దేశాన్ని గడగడలాడించింది. ఈ నేపథ్యంలో 2020 మార్చి నెలలో జిల్లాలో తొలి కేసు నమోదైంది. లాక్డౌన్తో పాటు రకరకాల పద్ధతుల ద్వారా కరోనాను ప్రభుత్వం కట్టడిచేసింది. తిరిగి 2021 మార్చి నెలలో కరోనా రెండవ వేవ్ విజృంభించింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా 1,107 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 2021 ఏడాది చివరలో కరోనా లేకుండా పోయింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్తో పెద్ద ప్రమాదం లేదని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా మందులు, ఆక్సిజన్ అందుబాటులో..
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ డివిజన్లో కరోనా వైరస్ సోకినట్లు ఇంతవరకు ఎవరిని గుర్తించనప్పటికీ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంచారు. మందులు, ఆక్సిజన్తో పాటు ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు గదులు అందుబాటులో ఉన్నాయి. కరోనాతో ప్రజలు భయాందోళన చెందవద్దు.. జలుబు మాదిరిగా అది మారిపోయిందని, మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరథ్ తెలిపారు.
ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు సన్నాహాలు
నాగార్జునసాగర్: కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ప్రభుత్వం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇరవై రోజుల క్రితం ప్రపంచ సుందరీమణులు సాగర్కు వచ్చిన సందర్భంగా వారికోసం 20 పడకల ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఐసీయూ పడకలు ఏర్పాటు చేయడానికి సామగ్రిని తీసుకొచ్చారు. 20 బెడ్లలో కొన్నింటిని వేరు చేసి ప్రత్యేకంగా ఐసీయూను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నకిరేకల్ల్లో ఐసోలేషన్ వార్డు లేదు
నకిరేకల్: నకిరేకల్లోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు కేటాయించ లేదు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో లేవు. కేవలం నకిరేకల్ ఆసుపత్రిలో కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ ఓగోడు, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, శాలిగౌరారం మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కరోనా కిట్లు అందుబాటులో లేవు. వీటిని సమకూర్చుకునే పనిలో వైద్యసిబ్బంది నిమగ్నమైంది.
న్యూస్రీల్
ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు
ఫ కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని
వైద్య ఆరోగ్య శాఖ మౌఖిక ఆదేశాలు
ఫ ముందస్తు ఏర్పాట్లకు సూచన
ఫ అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టిన జిల్లా యంత్రాంగం

కోవిడ్పై అలర్ట్!

కోవిడ్పై అలర్ట్!

కోవిడ్పై అలర్ట్!

కోవిడ్పై అలర్ట్!