
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నల్లగొండ టూటౌన్: నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని ఆయుష్ డిపార్టుమెంట్ హోమియో మెడికల్ ఆఫీసర్ చక్రధర నర్సింహారావు అన్నారు. ప్రపంచ యోగా మాసోత్సవాల సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణ్, యోగా ఇన్స్పెక్టర్లు సింగం ప్రవీణ్యాదవ్, కోమల, జ్యోతి, చంద్రయ్య, చంద్రమౌళి, అమీన్బాబా, తదితరులు పాల్గొన్నారు.