
ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్
మిర్యాలగూడ అర్బన్: ప్రజల భద్రత కోసమే కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాశ్నగర్లో డీఎస్పీ కె.రాజశేఖరరాజు ఆధ్వర్యంలో 280 మంది పోలీసులు పలు బృందాలుగా విడిపోయి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అద్దెకు ఉంటున్న వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 98 ద్విచక్రవాహనాలు, 16ఆటోలు, మూడు కార్లు, ఒక ట్రాక్టర్తో పాటు 220 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కాలనీలో మొత్తం 50మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా వారిలో ఎనిమిది మందికి టెస్టుల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు తెలిపారు. యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు బానిసలు కావొద్దన్నారు. సైబర్ నేరాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఐదుగురు సీఐలు, 14మంది ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్

ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్