
బీజేపీని తరిమికొడితేనే దేశాభివృద్ధి
సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా
మునుగోడు: మతోన్మాదం పెంచడంతోపాటు పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీని దేశం నుంచి తరిమికొడితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో గురువారం నిర్వహించిన సీపీఐ 15వ మండల మహాసభకు ఆయన హాజరై మాట్లాడారు.
బీజేపీకి మద్దతులేని రాష్ట్రాల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తోందన్నారు. బీజేపీ నాయకుల కుట్రలు, ఎత్తుగడులను తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ కూటమితో జత కట్టామని అన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం కాల్చిచంపడం సరైందికాదన్నారు. ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్గఢ్ అడవుల్లోని యూరేనియం తవ్వి కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే మావోయిస్టులను చంపేస్తున్నారని ఆరోపించారు. ఉప్పునూతల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈసభలో గుర్జ రామచంద్రం, సురిగి చలపతి, బిలాలు, చాపల శ్రీను, లింగయ్య, మందుల పాండు, యాదయ్య, వెంకన్న, కై లాస్, జానీ, వంశీకృష్ణ, శంకర్ పాల్గొన్నారు.