అనరు్హలను తొలగించేలా.. | - | Sakshi
Sakshi News home page

అనరు్హలను తొలగించేలా..

May 29 2025 9:47 AM | Updated on May 29 2025 9:47 AM

అనరు్హలను తొలగించేలా..

అనరు్హలను తొలగించేలా..

విచారించిన తర్వాతే తొలగింపు

ప్రస్తుతం ఆరు నెలల పైచిలుకు రేషన్‌ బియ్యం తీసుకోని కార్డుదారులు 5,092 మంది ఉన్నారు. కమిషనర్‌ ఆఫీస్‌ నుంచి వారి జాబితా మాకు అందింది. మండలాల వారీగా ఆ వివరాలను తహసీల్దార్లకు పంపించాం. నివేదిక వచ్చిన తర్వాతే దాన్ని పూర్తిగా విచారించి అనర్హులను తొలగిస్తాం.

– వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ, నల్లగొండ

నల్లగొండ: రేషన్‌ షాపుల ద్వారా అందించే సన్న బియ్యం అర్హులైన పేదలకే అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడు నెలల క్రితం వరకు దొడ్డు బియ్యం ఇచ్చిన ప్రభుత్వం రెండు నెలల నుంచి సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే అర్హులైన పేదలకు మాత్రమే ఈ బియ్యం అందాలనే ఉద్దేశంతో అనర్హులను తొలగించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆరు నెలల నుంచి రేషన్‌ తీసుకోని కార్డుదారుల వివరాలు గుర్తించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.

మొదలైన విచారణ

జిల్లాలో గత ఆరు మాసాల నుంచి దాదాపు సంవత్సరం కాలంగా 5,092 మంది రేషన్‌ కార్డుదారులు బియ్యాన్ని తీసుకోవడం లేదని అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయా కార్డుదారులు అసలు ఉన్నారా.. లేరా వలస వెళ్లారా.. లేక చనిపోయారా అనే దానిపై విచారణ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తొలగించేందుకు నివేదిస్తారు. అయితే గత జనవరి నుంచి పరిశీలిస్తే మార్చి వరకు జిల్లాలో లక్ష మంది వరకు ఒక్కో మాసంలో కార్డుదారులు బియ్యం తీసుకోవడం లేదు. ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యం ఇవ్వడంతో బియ్యం తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆరు నెలల పైచిలుకు ఒక్కసారి కూడా బియ్యం తీసుకోనివారిని మాత్రమే సర్వే చేస్తున్నారు. ఆరు నెలల పైచిలుకు బియ్యం తీసుకోని వారి జాబితాను రేషన్‌ షాపుల వారీగా సేకరించి తహసీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పంపించారు. ఆ జాబితా ఆధారంగా తహసీల్దార్లు, ఆర్‌ఐలు ఇతర సిబ్బందిచేత గ్రామాల్లో, పట్టణాల్లో ఆ కార్డుదారులు ఉన్నారా లేరా అనే దానిపై విచారణ చేసి నివేదిక సమర్పిస్తారు.

అర్హులకు న్యాయం చేయాలనే..

ఒక పక్క ప్రభుత్వం అర్హులైన వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డులు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో 15 వేల మందికి కొత్త కార్డులు మంజూరయ్యాయి. ఇంకా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం అర్హులకు అందించి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనర్హుల కార్డులు ఏరివేత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నెలల తరబడి బియ్యం తీసుకోని కార్డుదారులను పరిశీలించి ఆ పేర్లను తొలగించేందుకు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

ఫ ఆరు నెలలుగా రేషన్‌ బియ్యం

తీసుకోని కార్డుదారులపై నజర్‌

ఫ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

ఫ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న

రెవెన్యూ సిబ్బంది

ఫ ఇప్పటికే రేషన్‌ తీసుకోని

కార్డుదారులు 5,092గా గుర్తింపు

ఫ ఐదు నెలలుగా బియ్యం తీసుకోని

వారి సంఖ్య లక్షల్లోనే..

2025 జనవరి నుంచి రేషన్‌ తీసుకోని వారి వివరాలు

నెల మొత్తం కార్డులు తీసుకోనివారు

జనవరి 4,65,998 1,04,278

పిబ్రవరి 4,66,649 1,09,731

మార్చి 4,66,522 1,10,033

ఏప్రిల్‌ 4,65,941 87,515

మే 4,74,681 98,083

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement