
మిర్యాలగూడ మున్సిపల్ సిబ్బందికి మెమోలు
మిర్యాలగూడ: మిర్యాలగూడ మున్సిపాలిటీలో అవెన్యూ ప్లాంటేషన్ పేరిట రూ.70లక్షలు కాజేసిన వ్యవహారంపై మున్పిల్ డీఈతోపాటు మరో ముగ్గురు సిబ్బందికి అదనపు కలెక్టర్ మెమోలు జారీ చేయడంతోపాటు సంజాయిషీ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు అందించారు. ఈ విషయంపై బుధవారం సాక్షి దినపత్రికలో మొక్కలు మింగేశారు అనే శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై జిల్లా అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ స్పందించారు. బుధవారం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మొక్కలు నాటకుండా చెక్కు ఎలా జారీ చేశారంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఆ చెక్కు పాస్ కాకుండా హోల్డ్లో పెట్టించారు. దీనికి బాధ్యులుగా మున్సిపల్ డీఈ వెంకన్నకు, అకౌంటెంట్ ధనుంజయ, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేశ్వర్లు, మరో సిబ్బంది సుబ్రహ్మణ్యంకు మెమోలు జారీ చేసి షోకాజ్ నోటీసులు అందించారు. అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి చెక్కు జారీలో మీ ప్రమేయం ఏంటో మూడు రోజుల్లో మీ అభిప్రాయాన్ని రాతపూర్వకంగా తెలపాలని ఆదేశించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ తెలిపారు.
ఫ డీఈతోపాటు ముగ్గురు సిబ్బందికి
షోకాజ్ నోటీసులు జారీ
ఫ ‘మొక్కలు మింగేశారు’ కథనంపై
స్పందించిన సబ్ కలెక్టర్