
దేవరకొండలో తిరంగా ర్యాలీ
దేవరకొండ : పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం దేవరకొండ పట్టణంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, లాలునాయక్, ఏటి కృష్ణ, కల్యాణ్నాయక్, రవికుమార్, సురేష్, వస్కుల సుధాకర్, పున్న వెంకటేష్, నక్క వెంకటేష్, ఎన్వీటీ, శివగౌడ్, గణేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.