
కారును ఢీకొట్టిన డీసీఎం.. నలుగురికి గాయాలు
నకిరేకల్: ముందు వెళ్తున్న కారును డీసీఎం ఢీకొనడంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున నకిరేకల్ పట్టణ శివారులో జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు డ్రైవర్ నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ హైవే బైపాస్ పైకి రాగానే సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొని ఆగిపోయింది. డీసీఎం అదుపుతప్పి అదే కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి, డీసీఎంలో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంలో వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లచ్చిరెడ్డి తెలిపారు. క్షతగాత్రులంతా హైదరాబాద్కు చెందినవారని పేర్కొన్నారు.