
గేదెను ఢీకొని యువకుడి మృతి
భూదాన్పోచంపల్లి: బైక్పై ఇంటికి వెళ్తున్న యువకుడు గేదెను ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతావానిగూడెం గ్రామానికి చెందిన ఒంటెద్దు సాయి(24) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం బైక్పై ఇంటికి వెళ్తుండగా ముక్తాపూర్ నుంచి తప్పించుకొని సీతావానిగూడెం వైపు వచ్చిన గేదె పరిగెడుతూ రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డంగా రావడంతో గేదెను తప్పించబోయి దానిని ఢీకొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సాయి తలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అంబులెన్స్లో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే సాయి మృతిచెందినట్లు తెలిపారు. సాయి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు.