ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలి | - | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలి

May 24 2025 1:09 AM | Updated on May 24 2025 1:09 AM

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలి

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే ఆపాలి

మిర్యాలగూడ : ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ఆపరేషన్‌ కగార్‌ను కేంద్రం వెంటనే ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ప్రభుత్వం నరమేధం సాగిస్తోందన్నారు. కగార్‌ ఆపరేషన్‌ను వెంటనే ఆపి అక్కడ ఉన్న బలగాలను వెనక్కి పిలిపించాలన్నారు. ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని ప్రభుత్వం దుర్మార్గంగా చంపడం హేయమైన చర్య అన్నారు. అడవిలో ఉన్నవారు ప్రజల కోసం పోరాడుతున్నారే తప్ప వ్యక్తిగతంగా హింస చేయడం లేదన్నారు. అడవిలో ఉన్న సహజ వనరులు, ఖనిజ సంపదను కాజేసి బడా కంపెనీలకు అప్పజెప్పడం కోసం ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందన్నారు. ఆపరేషన్‌ కగార్‌పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, నాయకులు రవినాయక్‌, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, వినోద్‌నాయక్‌, తిరుపతి రామ్మూర్తి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement