
గోవులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత
చింతపల్లి: కొండమల్లేపల్లి వైపు నుంచి హైదరాబాద్కు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 9 ఆవు దూడలను పోలీసులు పట్టుకున్నారు. చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాల్లో 9 ఆవు దూడలను కబేళాలకు తరలిస్తుండగా వాటికి ఎలాంటి అనుమతి లేదని గుర్తించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్కు చెందిన నోముల భాగ్యయ్య గౌడ్ ఎండీ.సాజిద్పాషాను పట్టుకున్నారు. ఆవు దూడలకు వెటర్నరీ డాక్టర్ వద్ద పరీక్షలు నిర్వహించి, గురునానక్ గోశాల వెల్దండకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.