
నృసింహుడి సేవలో హిమాన్షు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు తన స్నేహితులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హిమాన్షుకు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి ప్రసాదాన్ని అందించారు. కాగా హిమాన్షుకు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య స్వాగతం ఫలికారు.