శాటిలైట్‌ టోల్‌ వసూలు ఇప్పట్లో లేనట్లే.. | - | Sakshi
Sakshi News home page

శాటిలైట్‌ టోల్‌ వసూలు ఇప్పట్లో లేనట్లే..

May 12 2025 1:05 AM | Updated on May 12 2025 6:51 AM

శాటిలైట్‌ టోల్‌ వసూలు ఇప్పట్లో లేనట్లే..

శాటిలైట్‌ టోల్‌ వసూలు ఇప్పట్లో లేనట్లే..

చౌటుప్పల్‌ రూరల్‌: జాతీయ రహదారులపై టోల్‌ వసూలుకు శాటిలైట్‌ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు మే 1వ తేదీ నుంచి అమలు చేస్తారని మొదట్లో అనుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. టోల్‌ వసూలుకు కచ్చితమైన సొంత నావిగేషన్‌ ఉపగ్రహాలు మరిన్ని అందుబాటులోకి వచ్చే వరకు ఈ ప్రక్రియ జాప్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు వెల్లడించారు. జీపీఎస్‌ విధానానికి ప్రత్యామ్నాయంగా ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌)ను సొంతంగా రూపొందించింది. అయితే ఈ టెక్నాలజీని ఇస్రో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే శాటిలైట్‌ విధానంలో టోల్‌ వసూలు చేసేందుకు కేంద్రం సన్నాహలు చేస్తోంది. ఈ వ్యవస్థను మొదటగా దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఈ ఏడాది ఆగస్టు నుంచి పైలెట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేయనున్నారు. అక్కడ ఈ విధానం విజయవంతంగా అమలు జరిగిన తర్వాత దేశంలోని జాతీయ రహదారుల అన్నింటికి అమలు చేయనున్నారు. మొదటగా భారీ వాహనాలకు శాటిలైట్‌ టోల్‌ వసూలు విధానం అమలు చేసి తర్వాత కార్లు, మిగతా వాహనాలకు ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలిసింది. 2027 నుండి అన్నిరకాల వాహనాలకు శాటిలైట్‌ విధానం అమలు చేయనున్నారు. ఈ విధానం అమలు కోసం ఫాస్టాగ్‌ స్థానంలో నావిగేషన్‌ చిప్‌ను వాహనాలకు బిగించనున్నారు. కార్లకు ఈ చిప్‌ జీపీఎస్‌ కోసం రూ.4వేల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని ఫాస్టాగ్‌ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

నావిగేషన్‌ ఉపగ్రహాలు అందుబాటులోకి

వచ్చే వరకు వాయిదా

పూర్తిస్థాయిలో అభివృద్ధికాని

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ టెక్నాలజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement