కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి

May 2 2025 1:43 AM | Updated on May 2 2025 1:43 AM

కూలీల

కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి

రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన

చిట్యాల: ఉపాధి హామీ కూలీలకు రోజువారీగా వేతనం గిట్టుబాటు అయ్యేలా అధికారులు పనులు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోని తిరులనాథస్వామి ఆలయ గుట్టపై ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన కందకం తవ్వకం పనులు, వన నర్సరీలను గురువారం ఆమె జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు, రోజుకు వస్తున్న వేతన వివరాలు, సమస్యలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నర్సరీల్లో నీడనిచ్చే, పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో తాము సొంత డబ్బులతో పనులు చేయాల్సి వస్తోందని ఆమెకు పలువురు కార్యదర్శులు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ రాజ్‌కుమార్‌, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య, తహసీల్దార్‌ క్రిష్ణనాయక్‌, ఎంపీడీఓ జయలక్ష్మీ, ఏపీఓ శ్రీలత, ఉపాధి సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఉపాధి పనులను నిర్లక్ష్యం చేయొద్దు

నార్కట్‌పల్లి: ఉపాధి హామీ పనులను నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన అన్నారు. నార్కట్‌పల్లిలో ఉపాధి పనులు, కంపోస్ట్‌ షెడ్‌, బ్రాహ్మణ వెల్లంలలో బృహత్‌ పల్లె ప్రకృతి వనం, మాదవ ఎడవల్లిలో పామ్‌పాండ్‌ పనులను గురువారం ఆమె పరిశీలించారు. అడిషనల్‌ పీడీ నవీన్‌, ఎంపీడీఓ ఉమేష్‌, ఎంపీఓ సుధాకర్‌, ఏపీఓ యాదయ్య, కార్యదర్శులు ఉన్నారు.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

మర్రిగూడ : ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రా మంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. శివన్నగూడ గ్రామానికి చెందిన ఐతరాజు సత్తయ్య, రాములమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు ఐతరాజు మహేష్‌(32) మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మహేష్‌ తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మహేష్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాణి, కుమార్తె ఉంది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు.

కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి1
1/1

కూలీలకు గిట్టుబాటు వేతనం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement