మాడుగులపల్లి తహసీల్దార్‌ బదిలీ

మాడుగులపల్లి : తహసీల్దార్‌ అర్చన బదిలీ అయ్యారు. ఆమె మాడుగులపల్లి నుంచి చండూరుకు బదిలీపై వెళ్లినట్లు తెలిసింది. డిప్యూటీ తహసీల్దార్‌ నూల శివశంకర్‌ ప్రస్తుతం ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూర్తిస్థాయి తహసీల్దార్‌ వచ్చేంత వరకు ఆయనే కార్యాలయ కార్యకలాపాలు చూస్తారు.

ఫార్మా అనుమతి రద్దు చేయాలని మంత్రికి వినతి

మునుగోడు : మండలంలోని కిష్టాపురం గ్రామంలో నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ అనుమతులను వెంటనే రద్దు చేయించాలని కోరుతూ ఆదివారం నల్లగొండ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మునుగోడు మండలంలోని అఖిలపక్ష పార్టీల నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. కంపెనీ నిర్మా ణం చేపడితే ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యాలకు గురికావడంతోపాటు, పచ్చని పంట పొలాలు కాలుష్యం కాటుకు దిగుబడి రాకుండా పోతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరా ట కమిటీ కన్వీనర్‌ భీమనపల్లి సైదులు ఉన్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top