సద్దన్నం భలే రుచి..
ఆకలి తప్ప ఏమీ తెలియని ఓ బాలుడు.. తాను ఎక్కడ ఉన్నాడు.. ఎందుకు ఉన్నాడో తెలియదు.. తెలిసిందల్లా ఆకలి మాత్రమే అనేలా పొలం గట్టున తల్లిపెట్టిన సద్దన్నం తింటున్నాడు. ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్కు చెందిన గొత్తికోయ గిరిజనులు మండలానికి కూలీ పనుల కోసం వచ్చారు. తోటి కూలీలతో వరి పొలంలో కలుపుతీసేందుకు వచ్చిన తల్లి కుమారుడిని గట్టుపై కూర్చోబెట్టి ఆకలి వేస్తే తినేందుకు సద్ది, తాగేందుకు అంబలి బాటిల్ను పెట్టి పనిలో నిమగ్నమైంది. ఎండలో కూర్చున్న ఆ బాలుడు ఆకలి వేయడంతో సద్దన్నం తింటూ తన తల్లి వైపు అమాయకంగా చూస్తుండగా సాక్షికి చిక్కాడు. – మంగపేట


