
రామాలయంలో ఆకాశదీపం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆకాశ దీపాన్ని అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్రావుశర్మ మంగళవారం రాత్రి వెలిగించారు. కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిరోజూ ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వెలుగుతుంది. ఈ దీపం నెల రోజుల పాటు ఉంటుందని అర్చకులు తెలిపారు. దీపాన్ని దర్శించుకోవడం వల్ల శుభం కలుగుతుందని ఆయన వివరించారు.
విదేశాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి
వెంకటాపురం(కె): మండల పరిధిలోని తిప్పాపురం గ్రామ సమీపంలో కోడి పందేలా స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై కొప్పుల తిరుపతి రావు కథనం ప్రకారం.. తిప్పాపురం గ్రామ సమీపంలో కోడిపందేలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 26 ద్విచక్రవాహనాలు, మూడు కోడి పుంజులు, 8 కత్తులతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
సంపూర్ణ ఆరోగ్యానికి వెల్నెస్ సెంటర్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని విద్యార్థులకు, అధ్యాపకులకు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యానికి వెల్నెస్ సెంటర్ తోడ్పడుతోందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్ వరంగల్, బెంగుళూరు హార్ట్ ఆఫ్ లీవింగ్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను మంగళవారం బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ కిరణ్కుమార్, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన పెట్రోల్ అందించాలి
మల్హర్: వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలని డీసీఎస్ఓ కిరణ్కుమార్, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీలత అన్నారు. విని యోగదారుల ఫిర్యాదు మేరకు మంగళవారం తాడిచర్ల హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్లో తనిఖీ చేపట్టా రు. గాలి పంపు, మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ నాణ్య త, వ్యత్యాసాన్ని పరిశీలించేందుకు నమూనాలను సేకరించారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవన్నారు. అనంతరం మల్లారం రైస్ మిల్లును పరిశీలించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ ఆర్ఐ సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.