
మహాసభలను జయప్రదం చేయాలి
● సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు
ములుగు రూరల్: రేపు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబోయే సీపీఐ 3వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలకు ఎల్లప్పుడూ ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులాలు మతాల పేరుతో గొడవలు సృష్టిస్తుందని వివరించారు. మతతత్వవాదులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంపాల రవీందర్, అంజద్ పాషా, అచంటి ప్రసాద్, ముత్యాల రాజు, కొమురయ్య, రవి, గోపి తదితరులు పాల్గొన్నారు.