
టేకుకలప స్వాధీనం
వెంకటాపురం(కె): మండలం నుంచి రెండు వాహనాల్లో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న టేకుకలపను స్వాధీనం చేసుకున్నట్లు మండల అటవీశాఖ అధికారి వంశీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలను వెల్లడించారు. రెండు పికప్ వాహనాల్లో అక్రమంగా టేకుకలప తరలిస్తున్నారనే సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఒక వాహనాన్ని, వెంకటాపురం మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో మరో వాహనాన్ని అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు వాహనాల్లో 16 టేకు మొద్దులు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారుగా రూ.4లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టేకు కలప, వాహనాలను అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు వివరించారు.