నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Jul 17 2025 8:48 AM | Updated on Jul 17 2025 8:50 AM

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని వ్యాపార సముదాయాల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌ అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో మటన్‌, చికెన్‌, చేపల విక్రయ ప్రదేశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణదారులు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని సూచించారు. మాంసం, చికెన్‌, చేపలను పరిశుభ్రమైన వాతావరణంలో అమ్మకాలు చేపట్టాలన్నారు. నిబందనలు పాటించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ సంపత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement