
మొక్కలు, చెట్లే ప్రకృతికి అందం
భూపాలపల్లి: మొక్కలు, చెట్లే ప్రకృతికి అందమని, భవిష్యత్ తరాల సంక్షేమమే వన మహోత్సవ కార్యక్రమ లక్ష్యమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించగా, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవంలో జిల్లా పోలీసులు ముందుండాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్ల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్కుమార్, వర్టికల్ డీఎస్పీ నారాయణనాయక్, జిల్లా పరిధిలోని సీఐలు, రి జర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే