మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు

Jun 10 2025 3:40 AM | Updated on Jun 10 2025 3:40 AM

మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు

మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు

వెంకటాపురం(కె): మావోయిస్టులకు సహకరిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని ఏటూరునాగారం ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బోదాపురం పంచాయతీ సీతా రాంపురం గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యను తె లుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావే శం నిర్వహించారు. గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాబోయో వ ర్షాకాలం సీజన్‌లో వాగులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున, వాగుల వద్దకు ఎవరూ వెళ్లొద్దన్నారు. అనంతరం గ్రామస్తులకు దోమ తెరలను పంపిణీ చేశారు. ఎస్సై కొప్పుల తిరుపతి రావు, సీఆర్‌పీఎఫ్‌, సివిల్‌ పోలీసులు ఉన్నారు.

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement