
మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు
వెంకటాపురం(కె): మావోయిస్టులకు సహకరిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని ఏటూరునాగారం ఏ ఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బోదాపురం పంచాయతీ సీతా రాంపురం గ్రామంలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాన్ని సందర్శించి గ్రామంలో నెలకొన్న సమస్యను తె లుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావే శం నిర్వహించారు. గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు వస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాబోయో వ ర్షాకాలం సీజన్లో వాగులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున, వాగుల వద్దకు ఎవరూ వెళ్లొద్దన్నారు. అనంతరం గ్రామస్తులకు దోమ తెరలను పంపిణీ చేశారు. ఎస్సై కొప్పుల తిరుపతి రావు, సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు ఉన్నారు.
ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ