
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం..
ములుగు రూరల్: ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ జాతీయ నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్కు ఎంపికై తే మౌలిక వసతులు మెరుగుపడతాయని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్ అన్నారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండలంలోని పందికుంట ఆయూష్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రిజిస్టర్లను తనిఖీ చేయడంతో పాటు మందుల నిల్వలను, గదులను, ఐఈసీ మెటీరియల్ పోస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మందిర్లో రోగులకు ఆరోగ్య భద్రత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి అన్వేష్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంపత్రావు, శరత్, నందకిషోర్, జితేందర్, శ్యాం, ఆర్బీఎస్కే వైద్యాధికారులు మల్లికార్జున్, భూపాల్రెడ్డి, వినోదర్, స్వామి, సూపర్వైజర్లు దేవమ్మ, ఆరోగ్య కార్యకర్త దేవమ్మ, నాగరాణి, వెంకన్న, హరి , ఆశలు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్