
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు
ప్రజావాణిలో
ఈ వినతులే అధికం
● అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ టీఎస్ దివాకర
● గ్రీవెన్స్లో మొత్తం 31 దరఖాస్తులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న నిరుపేద దంపతులు వెంకటాపురం (ఎం) మండలం జవహార్నగర్కు చెందిన అన్నారపు తిరుపతి, సుమలత దంపతులు. 13 సంవత్సరాలుగా జవహార్నగర్లో పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో ఇల్లు మంజూరు చేస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మించుకుంటామని కలెక్టర్ను వేడుకున్నారు. ఇలా జిల్లాలో చాలా మంది నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతిపత్రాలు అందించారు.
●