ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి

Jun 10 2025 3:40 AM | Updated on Jun 10 2025 3:40 AM

ఉపకరణ

ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి

ములుగు రూరల్‌: దివ్యాంగులకు ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్‌ సంక్షేమాధికారి తుల రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌ జెండర్స్‌ వ్యక్తుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉపకరణాల మంజూరు చేపట్టారని, అర్హత కలి గిన వారు ఈ నెల 18వ తేదీ లోపు టీజీఓబీఎంఎంఎస్‌. సీజీజీ. జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జిల్లాకు రెట్రోఫిటేడ్‌ స్కూటీలు –14, బ్యాటరీ వీల్‌ చైర్‌లు– 4, మొబైల్‌ బిజిపనెస్‌ బ్యాటరీ ట్రై సైకిల్స్‌– 6, హైబ్రిడ్‌ వీల్‌ చైర్స్‌ –1, లాప్‌ట్యాప్స్‌–5, జి స్మార్ట్‌ ఫోన్లు –1, ట్రై సైకిల్స్‌–3, వీల్‌ చైర్స్‌–2, చేతి కర్రలు–7, వినికిడి యంత్రాలు–1, స్మార్ట్‌ కేన్స్‌–4, ఎంసీఆర్‌ చెప్పల్స్‌ –4 కేటాయించినట్లు తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గిరిజన గురుకుల

బాలికల డిగ్రీ కళాశాలలో..

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీవాణి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఎంపీసీ, ఎంపీసీఎస్‌, బీజేసీ, బీకాం జనరల్‌, బీకాం కంప్యూటర్స్‌, బీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు 8332864686, 9515960845 నంబర్లలో సంప్రదించాలన్నారు.

అధికారుల సూచనలు పాటించాలి

ములుగు రూరల్‌/వాజేడు: బొగత జలపాతాన్ని సందర్శించే క్రమంలో పర్యాటకులు అటవీశాఖ అధికారుల సూచనలు పాటించా లని డీఎఫ్‌ఓ రాహుల్‌ జాదవ్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జలపాతం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని, పర్యాటకులు భద్రతా సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సోషల్‌ మీడియాలో లోతుగా ఉన్న జలపాతాలను సందర్శించాలని పోస్టులు పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చిందని, అలాంటి జలపాతాలను పర్యాటకులు సందర్శించొద్దన్నారు.

మధ్యాహ్న భోజన సామగ్రి పంపిణీకి సిద్ధం

ములుగు రూరల్‌: జిల్లాలోని 298 ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన వంట సామగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ కమిషనర్‌ జిల్లాకు సుమారు రూ.20లక్షల విలువైన 9 రకాల వస్తువులను పంపిణీ చేశారు. ఇందులో ఐదు కిలోల గిన్నెల నుంచి 40 కేజీల గిన్నెలు, బియ్యం భద్రపరచడానికి, వడ్డించడానికి, తాగునీరు నిల్వ చేసేందుకు తదితర వస్తువులు ఉన్నాయి. వీటిని జిల్లా కేంద్రంలోని దివ్యాంగుల భవనంలో భద్రపరిచారు. త్వరలో మండలాల వారీగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న వారిపై చర్య తీసుకోవాలి

ములుగు రూరల్‌: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ మమన్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్ట్‌ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. స్టేషనరి దుకాణాలను పాఠశాలల్లో ఏర్పాటు చేసి విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నారన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయిరాం, రజినీకాంత్‌, జశ్వంత్‌, శ్రీతన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపకరణాలకు  దరఖాస్తు చేసుకోవాలి1
1/1

ఉపకరణాలకు దరఖాస్తు చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement