
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ములుగు రూరల్: మధ్యాహ్న భోజన తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యత ప్రమాణాలతో అందించాలని సూచించారు. వంటల్లో నాణ్యత ప్రమాణాల మేరకు సరుకులను వినియోగించాలని సూచించారు. మధ్యాహ్న భోజన ఇన్చార్జ్ ఉపాధ్యాయులు భోజన తయారీని తప్పకుండా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుళ్లపెల్లి సాంబయ్య, డీసీఈవి కార్యదర్శి సూర్యనారాయణ, కో ఆర్డినేటర్లు హర్షం రాజు, రమాదేవి, ఎంఈఓ తిరుపతి, రిసోర్స్ పర్సన్లు వినోద్కుమార్, విద్యాసాగర్, వంట కార్మికులు పాల్గొన్నారు.
డీఈఓ పాణిని