రామప్పను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు | - | Sakshi
Sakshi News home page

రామప్పను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు

Jun 11 2025 11:36 AM | Updated on Jun 11 2025 11:36 AM

రామప్పను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు

రామప్పను సందర్శించిన ట్రెయినీ ఐఏఎస్‌లు

వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం ట్రెయినీ ఐఏఎస్‌లు సౌరభ్‌శర్మ, సలోని చబ్ర, హర్ష చౌదరి, ప్రణయ్‌ కుమార్‌, కరోలిన్‌ చింగ్తాయిన్మావిలు సందర్శించారు. హైదరాబాద్‌లోని శిక్షణ పొదుతున్న ట్రెయినీ ఐఏఎస్‌లు తెలంగాణ దర్శన్‌లో భాగంగా రామప్ప ఆలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. వారి వెంట ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారులు, టూరిజం అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement