
‘అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సరికాదు’
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సరికాదని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎండి. చాంద్పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. జిల్లాలో అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంతో అసూయతో ప్రజలను తప్పుతోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. జిల్లాలో మంత్రి సీతక్క చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, రాజేందర్గౌడ్, సుమన్రెడ్డి, రవియాదవ్, భిక్షపతి, భరత్కుమార్ పాల్గొన్నారు.