శాస్త్రోక్తంగా గరుడాదివాసం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా గరుడాదివాసం

May 10 2025 8:20 AM | Updated on May 10 2025 8:20 AM

శాస్త్రోక్తంగా గరుడాదివాసం

శాస్త్రోక్తంగా గరుడాదివాసం

దైత అమ్మవారికి తిరుమంజనం

మంగపేట: మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో (జాతర) రెండోరోజు గరుడాదివాసం కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల యాగ్నికులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం ఆలయ ప్రాంగణంలోని దైత అమ్మవారికి తిరుమంజనం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రోచ్ఛారణతో కుంకుమ, చందనం, జలం, పాలతో అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారికి నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపించారు. సాయంత్రం యాగశాలలో గరుడాదివాసం కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 నుంచి గరుడపఠ లేకనం లిఖించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై టీవీఆర్‌ సూరి, ఆలయ బ్రహ్మోత్సవాల ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్‌, అర్చకులు ముక్కామల శేఖర్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఈ శ్వర్‌చంద్‌రామానుజం, యాగ్నికుల బృందం అమరవాది రామనర్సింహచార్యులు, పి. మధన మోహనాచార్యులు, మణిదీపాచార్యులు, అభిరామాచా ర్యులు, శ్రీమాన్‌ రామచంద్రాచార్యులు, ఆలయ సీ నియర్‌ అసిస్టెంట్‌ సీతారాములు, రికార్డు అసిస్టెంట్‌ గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది అజయ్‌, నవీన్‌, గణేష్‌, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement