ఒకవైపు దర్శకుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే.. నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు వేణు ఊడుగుల. ఆయన నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం భారీ కలెక్షన్స్తో బోలెడు అవార్డులను సొంతం చేసుకుంది. ఆయన సమర్పణలో మరో వైవిధ్యమైన చిత్రం రాబోతుంది. ప్రముఖ అడ్వకేట్ , రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించిన డా.నాగేశ్వరరావు పూజారి తన ‘సైన్మా స్టూడియోస్’ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు నిర్మాత డా.నాగేశ్వరరావు పూజారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి కంటిని, ఆ కంటిలో ఇద్దరు బ్రదర్స్ సైకిల్ పై వెళ్తుండటం చూపించారు.‘గుణం, గణం, నీతో రణం - ఇది తథ్యం’.. ఇద్దరు సోదరుల భావోద్వేగభరితమైన కథ ’ అంటూ వేణు ఊడుగుల ఈ పోస్టర్ని ట్వీట్ చేశాడు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.


