'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం'.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ట్వీట్‌! | Tollywood Hero Allu Arjun Tweet Goes Viral On His Statue In Dubai | Sakshi
Sakshi News home page

Allu Arjun: 'నా కెరీర్‌ ఒక మరపురాని ప్రయాణం'.. అల్లు అర్జున్‌ ఎమోషనల్!

Mar 28 2024 8:10 PM | Updated on Mar 28 2024 8:53 PM

Tollywood Hero Allu Arjun Tweet Goes Viral On His Statue In Dubai - Sakshi

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకున్నారు మన ఐకాన్‌ స్టార్‌. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ ఈ విషయంపై ట్వీట్‌ చేశారు. 

అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి  2003లో ఈ రోజే విడుదలైంది. ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నా.' అని పోస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement