
ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం అయ్యాయి.
తాజాగా కల్కి అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలోని మరియమ్ పాత్రను ప్రేక్షకులకు చిత్ర యూనిట్ పరిచయం చేసింది. మరియమ్ పాత్రలో సీనియర్ నటి, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శోభన నటిస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. 2006లో వచ్చిన ‘గేమ్’ సినిమా తర్వాత శోభన తెలుగులో మరో సినిమా చేయలేదు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత కల్కి చిత్రం ద్వారా మళ్లీ వెండితెరపై శోభన కనిపించనున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
మరో 8 రోజుల్లో మరియమ్ను కలుస్తారని వైజయంతి మూవీస్ వారు ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. అందరినీ మెప్పించేలా ఆమె లుక్ ఉంది. ప్రస్తుతం నెట్టింట శోభన పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రల్లో నటించారనే టాక్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో ఎవరెవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.
Her ancestors waited too, just like her…
8 days to go for #Kalki2898AD.@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani #Shobana @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/xEnJZRuPQ3— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 19, 2024