
నిహాల్, ఆశ్లేష ఠాకూర్ జంటగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శాంతల’. ఈ చిత్రానికి శేషు పెద్దిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో నటించిన ఆశ్లేష ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాలోని రెండు పాటలను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్రబృందం పాత్రికేయులతో ముచ్చటించారు.
(ఇది చదవండి: మెగా ఇంట్లో బారసాల వేడుక.. వారికి గిఫ్ట్గా ఏమిచ్చారంటే?)
దర్శకుడు శేషు మాట్లాడుతూ.. 'ఈ కథను నేను కేఎస్ రామారావుకు చెప్పగానే చాలా బాగుంది. సినిమా తీస్తా అన్నారు. దాదాపు ఏడాదిన్నర తిరిగాను. నన్ను నమ్మి ఈ అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా. సినిమా కోసం ఆయన సలహాలు ఇస్తూ సినిమా అద్భుతంగా వచ్చేలా చేశారు. ఆయనకు ఆజన్మాంతం రుణపడి ఉంటా.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, వీణా నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
కేయస్ రామారావు మాట్లాడుతూ.. 'సబ్జెక్ట్లో ఏదో కొత్తదనం ఉంటే చిన్న సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయనేది అందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే నేను ఈ టీమ్తో కలిశా. శేషు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. చాలాకాలం తర్వాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో తీశాం.' అని అన్నారు.
(ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!)