స్పై మ్యూజియంలో... | Salman Khan Ek Tha Tiger Becomes First Indian Film At International Spy Museum | Sakshi
Sakshi News home page

స్పై మ్యూజియంలో...

Sep 10 2025 12:56 AM | Updated on Sep 10 2025 6:47 AM

Salman Khan Ek Tha Tiger Becomes First Indian Film At International Spy Museum

సల్మాన్‌ ఖాన్, కత్రినా కైఫ్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన స్పై యాక్షన్‌ డ్రామా ‘ఏక్‌ థా టైగర్‌’. ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. వాషింగ్టన్‌ డీసీలోని ఇంటర్‌నేషనల్‌ స్పై మ్యూజియంలో ఈ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ‘ఏక్‌ థా టైగర్‌’ కావడం విశేషం. ఈ విషయంపై ‘ఏక్‌ థా టైగర్‌’ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘అప్పట్లో అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన ఈ చిత్రానికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. ఓ సినిమా సక్సెస్‌ను బాక్సాఫీస్‌ వసూళ్లు మాత్రమే నిర్ణయించలేవు.

ఆ సినిమా ప్రేక్షకులకు ఎంతకాలం గుర్తుంటుందన్నది కూడా ముఖ్యమే’’ అని పేర్కొన్నారు. ఇక వాషింగ్టన్‌ డీసీలోని ఇంటర్‌నేషనల్‌ స్పై మ్యూజియంలో ‘జేమ్స్‌బాండ్, మిషన్‌ ఇంపాజిబుల్‌’ తదితర స్పై చిత్రాల పోస్టర్స్‌ను ప్రదర్శించారు. ఈ హాలీవుడ్‌ చిత్రాల చెంత హిందీ మూవీ చేరడం ఓ విశేషం. రూ. 75 కోట్ల బడ్జెట్‌తో ఆదిత్య చోప్రా నిర్మించిన ‘ఏక్‌ థా టైగర్‌’ (2012) దాదాపు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్స్‌గా వచ్చిన ‘టైగర్‌ జిందా హై, టైగర్‌ 3’ చిత్రాలు కూడా సక్సెస్‌ అయ్యాయి. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌’ చిత్రం షూట్‌తో హీరోగా బిజీగా ఉన్నారు సల్మాన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement