
వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. రణ్వీర్ చాలా ఎనర్జిటిక్ పర్సన్. ఎంతో టాలెంట్ ఉన్న ఇలాం
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో సూపర్డూపర్ హిట్ కొట్టాడు. దీంతో ఆయనతో కలిసి పని చేయాలని బాలీవుడ్ స్టార్స్ సైతం ఆశపడ్డారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ.. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి రాక్షస్ అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఆగిపోయిన మూవీ
ఇంతలోనే ఈ సినిమా ఆగిపోయినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. వీరి కాంబినేషన్లో ప్రాజెక్టు చేపట్టేందుకు ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. ఆ ప్రకటనలో ప్రశాంత్.. 'రణ్వీర్ చాలా ఎనర్జిటిక్ పర్సన్. ఎంతో టాలెంట్ ఉన్న ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి పని చేస్తాం అని పేర్కొన్నాడు.
భవిష్యత్తులో..
అటు రణ్వీర్ సింగ్ సైతం ప్రశాంత్ వర్మ టాలెంటెడ్ డైరెక్టర్. మేము కలిసి ఓ సినిమా చేయాలనుకున్నాం. అయితే ఫ్యూచర్లో తప్పకుండా కలిసి పని చేస్తాం అని తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది హనుమాన్కు సీక్వెల్గా తెరకెక్కుతోంది.
An official statement from the team about #RanveerSingh’s Project with #PrasanthVarma and #MythriMovieMakers!!
In a mutual understanding, the team decided to part ways with a possible collaboration in future. @RanveerOfficial @PrasanthVarma @MythriOfficial pic.twitter.com/OG2gqkwJMO— Ramesh Bala (@rameshlaus) May 30, 2024
చదవండి: కజ్రారే సాంగ్.. లైవ్లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్..