విధిరాత.. రాధేశ్యామ్‌ విషయంలో అదే జరిగింది : పూజా హెగ్డే | Radhe Shyam Heroine Pooja Hegde Says Films Have Their Own Destiny | Sakshi
Sakshi News home page

Pooja Hegde: రాధేశ్యామ్‌ రిజల్ట్‌పై తొలిసారి స్పందించిన పూజా హెగ్డే

Mar 21 2022 10:48 AM | Updated on Mar 21 2022 11:06 AM

Radhe Shyam Heroine Pooja Hegde Says Films Have Their Own Destiny - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం​ రాధేశ్యామ్‌. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అంతగా అందుకోలేకపోయింది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత డీలా పడిపోయింది. ఇక బాలీవుడ్‌ అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. పూర్తి ప్రేమకథ చిత్రమైనప్పటికీ ఒక్క యాక్షన్‌ ఎలిమెంట్‌ కూడా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారిపోయింది.

ప్రభాస్‌, పూజా హెగ్డే వంటి స్టార్స్‌ ఉన్నా  అనుకన్న రిజల్ట్‌ మాత్రం​ రాలేదు. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మనకు యావరేజ్‌ అనిపించినా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతాయి. మరికొన్ని మనకు బాగా నచ్చినా రిజల్ట్‌ అనుకున్నట్లు ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలాగే జరుగుతుంది. రాధేశ్యామ్‌ విషయంలో కూడా అదే జరిగింది. బాక్సీఫీస్‌ వద్ద సినిమా తలరాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement