 
													సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ భరత్ సతీమణి తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఓ జ్యువెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మొదటిసారి ఆమె పనిచేశారు. ఈ క్రమంలో ఒక వీడియోను విడుదల చేశారు. కెమెరా ముందు ఆమె తొలిసారే కనిపించినప్పటికీ చాలా చక్కగా యాడ్లో ఒదిగిపోయారు. నిమిషం పైగానే నిడివి ఉన్న ఈ ప్రకటనలో అనుభవం ఉన్న నటిగా మెప్పించడం విశేషం.
మొదటి నుంచి సినిమాలపై తేజస్విని ఆసక్తి చూపించేవారట! అందుకే ఆమె అఖండ 2 నిర్మాతగా పనిచేస్తున్నారు. ఆ పై తన తమ్ముడి మోక్షజ్ఞ చిత్రం కూడా ఆమె నిర్మాతగా లాంచ్ చేయనున్నారు. అయితే, ఇప్పుడు ఈ వాణిజ్య ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జ్యువెలర్స్ యాడ్కు దర్శకుడు వై.యమున కిషోర్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీకి తేజస్విని స్టెప్పులు అదుర్స్ అనేలా ఉన్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
