సస్పెన్స్‌... థ్రిల్‌  | Missterious Pre Release Event | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌... థ్రిల్‌ 

Dec 11 2025 1:09 AM | Updated on Dec 11 2025 1:09 AM

Missterious Pre Release Event

అబిద్‌ భూషణ్, రోహిత్‌ సహాని హీరోలుగా, రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్‌ టీరియస్‌’. మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో జై వల్లందాస్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘మిస్‌ టీరియస్‌’ ఫస్ట్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘1985 ఫిబ్రవరి 1వ తేదీ నేను మొదట నటించిన సినిమా ‘శ్రీ తాతావతారం’. ఆ సినిమాలో హీరో నరేశ్‌గారి కాలేజ్‌ ఫ్రెండ్స్‌ పాత్రల్లో నేను, మహి కోమటిరెడ్డి కలిసి నటించాం. ‘మిస్‌ టీరియస్‌’లో నేను నటించకపోయినప్పటికీ మహి వల్లే ఈ ఈవెంట్‌కి వచ్చాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని కోరారు. ‘‘మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది’’ అని మహి కోమటిరెడ్డి చెప్పారు. ‘‘150 థియేటర్స్‌లో మా చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు జై వల్లందాస్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement