‘మేజర్‌’ ఆపరేషన్‌ మళ్లీ ఆరంభం

Major Is An Upcoming Indian Biographical Action Film - Sakshi

ముంబయ్‌లో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌  హీరోగా నటిస్తున్నారు. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క దర్శకుడు. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థలతో కలసి సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సందీప్‌ పాత్రలో శేష్‌ చేస్తున్న ఈ ఆపరేషన్‌ గురువారం మళ్లీ ఆరంభమైంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఇది. అడివి శేష్‌ మాట్లాడుతూ– ‘‘ఇది నా ప్యాషన్‌ ప్రాజెక్ట్‌. ముంబయ్‌ విషాద ఘటనను వార్తల్లో చూసినప్పటి నుండి ఈ చిత్రంతో నా జర్నీ మొదలైంది. సందీప్‌ వంటి ధైర్యవంతుడి పాత్ర చేసే చాన్స్‌ నాకు ఇచ్చిన ఆయన తల్లితండ్రులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఈ షెడ్యూల్‌లో అడివి శేష్, సయీ మంజ్రేకర్‌ పాల్గొంటున్నారు. ఈ నెలాఖరుకి షూటింగ్‌ పూర్తవుతుంది. హిందీ, తెలుగు, మలయాళంలో ఈ ఏడాదే మా సినిమా రిలీజ్‌Sకానుంది’’ అన్నారు శశికిరణ్‌ తిక్క.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top