పనోరమా, పెన్‌ స్టూడియోస్‌ ఖాతాలో దృశ్యం–3 | Drishyam 3 Released By Panorama And Pen Studios | Sakshi
Sakshi News home page

పనోరమా, పెన్‌ స్టూడియోస్‌ ఖాతాలో దృశ్యం–3

Dec 8 2025 6:52 AM | Updated on Dec 8 2025 6:52 AM

Drishyam 3 Released By Panorama And Pen Studios

నటుడు మోహన్‌లాల్‌ మలయాళంలో కథానాయకుడిగా నటించిన దశ్యం చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటూ తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ  హిట్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దృశ్యం –2 చిత్రం రూపొంది మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా దృశ్యం– 3 నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇంతకుముందు రూపొందిన దృశ్యం 1,2 చిత్రాలు విశేష ప్రేక్షకుల ఆదరణ పొందడంతో తాజాగా రూపొందిన దృశ్యం –3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. 

జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆశీర్వాద్‌ సినిమాస్‌ సంస్థ నిర్మించింది. కాగా  పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన  దృశ్యం – 3 చిత్రం ప్రపంచవ్యాప్త విడుదల హక్కులను, డిజిటల్‌ హక్కులను పనోరమ స్టూడియోస్‌ ,పెన్‌ స్టూడియోస్‌ సంస్థలు కలిసి పొందాయి. ఇంతకు ముందు దృశ్యం – 2 చిత్రాన్ని మనోరమ స్టూడియోస్‌ సంస్థ హిందీలో నిర్మించి  మంచి విజయాన్ని అందుకుందని ఆ సంస్థ అధినేత కుమార్‌ మంగత్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 

కాగా దశ్యం – 3 చిత్రాన్ని పనోరమ స్టూడియోస్‌తో కలిసి విడుదల హక్కులను పొందడం, ఈ చిత్రాన్ని గ్లోబల్‌ ప్లాట్‌ఫారానికి తీసుకువెళ్లడం సంతోషంగా ఉందని పెన్‌ స్టూడియోస్‌ సంస్థ అధినేత డాక్టర్‌ జయంతి లాల్‌ గడ పేర్కొన్నారు. న్యూ సీక్రెట్స్‌తో కూడిన దృశ్యం– 3 చిత్రంతో మళ్లీ పాత మిత్రులందరిని కలవబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉందని నటుడు మోహన్‌లాల్‌ పేర్కొన్నారు. కాగా దృశ్యం సీక్వెల్‌కు అంతమే లేదని దర్శకుడు జీతూ జోసఫ్‌ పేర్కొన్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement