సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి

Oct 22 2025 9:30 AM | Updated on Oct 22 2025 9:30 AM

సంక్ష

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి విద్యుత్‌ అధికారుల ప్రజాబాట సకాలంలో రైతులకు విత్తనాలు 28న వైద్య పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: పేద వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి కోరారు. వివిధ గ్రామాలకు చెందిన పలువురికి ఆస్పత్రి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మంగళవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి పట్ల కాంగ్రెస్‌ చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌ నర్సింహ్మారెడ్డి నాయకులు అవుటి శంకర్‌ పాల్గొన్నారు. ఖేడ్‌ ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు చేపట్టిన సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఖేడ్‌ ప్రాంతంలో ఆయా రూట్లలో పలు బస్సులు నడపాల్సిన గ్రామాలను గురించి వారు చర్చించారు. ఖేడ్‌ క్యాంపు కార్యాలయంలో దీపావళిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు లక్ష్మిపూజ నిర్వహించారు.

నర్సాపూర్‌: విద్యుత్‌ సమస్యలను గుర్తించేందుకే తమ శాఖ ప్రజాబాట కార్యక్రమం చేపట్టిందని మెదక్‌ డీఈ బాషా, ఏడీఈ రమణరెడ్డి చెప్పారు. మంగళవారం పట్టణంలో ప్రజా బాట కార్యక్రమాన్ని డీఈ ప్రారంభించారు. ప్రజాబాటలో పలు సమస్యలను గుర్తించామని, వాటిని రెండు విభాగాలు విభజించామని చెప్పారు. బడ్జెట్‌తో కూడుకున్న సమస్యలకు నిధులు రాగానే పరిష్కరిస్తామన్నారు. బడ్జేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని రమణరెడ్డి తెలిపారు. పలు వీధుల్లో కండక్టర్‌ వైరు పాతబడిందని, దానిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏఈ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): రైతులకు సకాలంలో విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జహీరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండలానికి 350 బస్తాలు శనగ విత్తనాలు, 5 క్వింటాళ్ల కుసుమ విత్తనాలు వచ్చాయని వెల్లడించారు. విత్తనాలు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న రైతులు పట్టా పాస్‌ పుస్తకాలు, ఆధార్‌ కార్డులతో రైతు వేదిక వద్దకు మంగళవారం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విత్తనాలను న్యాల్‌కల్‌లోని రైతు వేదికల్లో రైతులకు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అభినాష్‌ వర్మ, ఏఈఓలు సాయిలు, హీనా, రైతులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో 12మంది వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటి భర్తీకి ఈ నెల 28న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్‌ డాక్టర్‌ శివదయాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్టులు 11, అసిస్టెంట్‌ సర్జన్‌ జీడీఎంఓస్‌ (01) పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈనెల 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 03 గంటల వరకు కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లోఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 93945 14999కు సంప్రదించాలన్నారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
1
1/2

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి
2
2/2

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement