
రైతు సంక్షేమానికి బీజేపీ పెద్దపీట
మెదక్ కలెక్టరేట్: రైతు సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే గత పదేళ్లలో 14 రకాల పంటలపై పలుమార్లు మద్దతు ధర పెంచిందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభి షేకం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర పెంచడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో ఆనందం నెలకొందన్నారు. అనంతరం జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యూరియా కొరత నివారించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు ఈశ్వర్రెడ్డి, లింగారెడ్డి, శంకర్, ఓబీసీ నాయకులు గడ్డం కాశీనాథ్, రాగి రాములు తదితరులు పాల్గొన్నారు.