
పెండింగ్ బకాయిలు చెల్లించండి
మెదక్ కలెక్టరేట్: ఉపాధి హామీ పథకంలో కూలీలకు రావాల్సిన బకాయిలతో పాటు పార్టీ(బీ) భూముల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 30 వేల ఎకరాల భూములు పార్ట్బీలో ఉన్నాయని తెలిపారు. ఫారెస్ట్, రెవెన్యూ మధ్యలో ఉన్న భూ సమస్యను పరిష్కరించాలన్నారు. పోడు పట్టాలు ఇవ్వాలని, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను భూ భారతి పోర్టల్లో పొందుపరిచి పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.