
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మెదక్ కలెక్టరేట్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమవంతుగా ఒక మొక్క నాటి సంరక్షించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మొక్కలు నాటడంతో ఆక్సిజన్ శాతం పెరిగి మానవ జాతి మనుగడకు సాకారం అవుతుందన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి పరిరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
నర్సాపూర్ రూరల్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి హేమలత పిలుపునిచ్చారు. గురువారం కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పిల్లల పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటించి సంరక్షించే విధానాన్ని అలవాటు చేయా లని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం పచ్చదనాన్ని కాపాడుకోవాల్సి న అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్, న్యాయవాదులు ఎగ్బాల్ అలీ జాఫర్, స్వరూప రాణి, మధుశ్రీ శర్మ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుభవల్లి