మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది | - | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది

Jun 6 2025 7:38 AM | Updated on Jun 6 2025 7:38 AM

మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది

మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది

మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు

మెదక్‌ కలెక్టరేట్‌: మాది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వమని, ఎమ్మెల్యేగా గెలిచిన 14 నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ అండగా నిలబడి, వారికి నిలువ నీడ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దశలవారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు. నియోజకవర్గంలో విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రజలలో మమేకమై పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నందున నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌, హౌసింగ్‌ పీడీ మాణిక్యం, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement