మద్యం అమ్మకాలపై నిషేధం | - | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మకాలపై నిషేధం

Jun 6 2025 7:38 AM | Updated on Jun 6 2025 7:38 AM

మద్యం అమ్మకాలపై నిషేధం

మద్యం అమ్మకాలపై నిషేధం

కిషన్‌తండా వాసుల ఏకగ్రీవ తీర్మానం

రామాయంపేట(మెదక్‌): మండలంలోని కిషన్‌తండా పంచాయతీ పరిధిలో సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం తండా వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎవరైనా మద్యం విక్రయాలు కొనసాగిస్తే రూ. లక్ష జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈమేరకు గ్రామస్తులు గురువారం సమావేశమై చర్చించారు. తండాలో ఉన్న రెండు బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలతో యువత చెడు మార్గం పడుతుందని, మద్యం సేవించిన వారు తరచూ రో డ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. తాము ఎన్నిసార్లు చెప్పినా బెల్ట్‌షాపు నిర్వాహకులు ఖాతరు చేయకుండా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని, ఇక నుంచి కొనసాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ మేరకు తీర్మాన ప్రతులను ఎకై ్సజ్‌, స్థానిక పోలీస్‌స్టేషన్లలో అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement