
‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోండి
కలెక్టర్ రాహుల్రాజ్
చిన్నశంకరంపేట(మెదక్): ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులను కూలీలు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శనివారం మండలంలోని మడూర్ గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ప రిశీలించారు. ఈసందర్భంగా కూలీలతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వంద రోజుల పని కల్పించనున్నట్లు తెలిపారు. చేపల చెరువుల తవ్వకంతో మత్స్యకారులు లబ్ధిపొందనున్నారని, అ లాగే గ్రామంలో ఎంత ఎక్కువ సంఖ్యలో పనులు నిర్వహిస్తే అదే స్థాయిలో ప్రత్యేక నిధులు అందనున్నాయన్నారు. భూమి లేని కూలీలు కనీసం 25 రోజుల పనిచేస్తేనే ఆత్మీయ భరోసా లభించనున్నట్లు చెప్పారు. త్వరలోనే దివ్యాంగులకు అవసరమైన పరికరాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజ్కుమార్, గ్రామ కార్యదర్శి ప్రతిభ ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసీ రికార్డులు పరిశీలించారు. ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వైద్య సిబ్బందికి సూచించారు.