
పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి
మెదక్ మున్సిపాలిటీ: పట్టణంలోని 4వ వార్డులో శనివారం మున్సిపల్ సిబ్బంది 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగి తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనానికి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో వేయకూడదని, అలా వేస్తే దోమలు పెరుగుతాయని హెచ్చరించారు. వార్డులో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.