కొనుగోళ్లలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో వేగం పెంచండి

May 31 2025 6:56 AM | Updated on May 31 2025 6:56 AM

కొనుగ

కొనుగోళ్లలో వేగం పెంచండి

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి

పాపన్నపేట/మెదక్‌ కలెక్టరేట్‌: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మిన్‌పూర్‌ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ ఏడాది రుతుపవనాలు త్వరగా వచ్చినందున వర్షాలు పడే అవకాశముందన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

జూన్‌ 2 నుంచి మంజూరు పత్రాలు

జూన్‌ 2వ తేదీ నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకం మొదటి విడత రూ. 1 లక్షలోపు రు ణాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పారదర్శకంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అన్‌లోడింగ్‌ త్వరగా పూర్తి చేయండి

శివ్వంపేట(నర్సాపూర్‌): ధాన్యం అన్‌లోడింగ్‌ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ నగేష్‌ అన్నారు. శుక్రవారం దొంతిలోని మీనాక్షి రైస్‌మిల్‌లో ధాన్యం అన్‌లోడింగ్‌ను పరిశీలించా రు. వర్షాలు పడుతున్నందున ధాన్యం త్వరగా అన్‌లోడింగ్‌ చేసి పంపించాలని యాజమానులకు సూచించారు.

రామాయంపేట(మెదక్‌): ముదిరాజ్‌లు చదువుతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని ఝాన్సిలింగాపూర్‌లో జరుగుతున్న పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముదిరాజ్‌ల సంక్షేమానికై తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఆలయాల నిర్మాణానికి సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకిష్టయ్య, తహసీల్దార్‌ రజనికుమారి తదితరులు పాల్గొన్నారు.

కొనుగోళ్లలో వేగం పెంచండి 1
1/1

కొనుగోళ్లలో వేగం పెంచండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement