
ప్రభుత్వ వైఫల్యంతోనే ఇబ్బందులు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. హమాలీలను సమకూర్చడంలో, వడ్ల రవాణాకు అవసరమైన లారీలు సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. వానాకాలం సీజన్కు కావాల్సిన విత్తనాలు సైతం అందుబాటులో లేవన్నారు. ఈ విషయమై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు వివరించారు. అనంతరం నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి మండలాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆమె వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు,